సచిన్ తనయుడి వివాహానికి హాజరైన నారా లోకేశ్, బ్రాహ్మణి
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:32 PM
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. వీరిని సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతించింది. అనంతరం.. ఈ కార్యక్రమానికి హాజరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో లోకేశ్, బ్రాహ్మణిలు మాట్లాడారు. కాగా.. ఈ వివాహ వేడుకలో పాల్గొనడం కోసం గురువారం ఉదయం ముంబైకి బయల్దేరి వెళ్లారు లోకేశ్ దంపతులు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ దంపతులు నవ వధూవరులైన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కలిసి ఈ వేడుకను మరింత వైభవంగా మార్చారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అర్జున్ - సానియాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో అర్జున్ టెండూల్కర్ తన చిన్ననాటి స్నేహితురాలు, బిజినెస్మేన్ సానియా చందోక్ను వివాహం చేసుకున్నాడు. కాగా.. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో తన కెరీర్ను కొనసాగిస్తున్నాడు.
ఇవీ చదవండి:
ఇరాన్పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్
మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా