Share News

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:53 PM

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, తిల‌క్ వ‌ర్మ వైస్ కెప్టెన్‌గా ఉండ‌నున్నాడు.

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ
India vs Afghanistan T20I series

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగ‌ళ‌వారం) భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, తిల‌క్ వ‌ర్మ వైస్ కెప్టెన్‌గా ఉండ‌నున్నాడు. ఇక వికెట్ కీప‌ర్లుగా సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్‌ల‌ను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూర‌మైన సంజూ శాంస‌న్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు.


ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, హ‌ర్షిత్ రాణాల‌ను ఎంపిక చేసిన‌ప్ప‌టికీ వారు కూడా ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబ‌ర్ 13 నుంచి 17 మ‌ధ్య‌ మూడు టీ20 మ్యాచ్‌ లు ఆడ‌నుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబ‌ర్ 13న‌, రెండో టీ20 సెప్టెంబ‌ర్ 15న‌, మూడో టీ20 సెప్టెంబ‌ర్ 17న జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు టీ20ల‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.


భారత జట్టు:

శ్రేయ‌స్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), శివమ్ దూబే, నితీశ్‌ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా*, అర్ష‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రానా*

గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు!

ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

Updated Date - Sep 01 , 2026 | 06:57 PM