ఇమ్రాన్ ఖాన్కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు..
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:25 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట కల్పించింది. వారిద్దరినీ ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని ఆడియాలా జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) ఊరట కల్పించింది. వారిద్దరినీ ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని ఆడియాలా జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేసింది (Imran Khan Pakistan court).
ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలను జైలులో ఏకాంతంగా ఉంచుతున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది. జస్టిస్ ఖాదిమ్ హుస్సేన్ సోమ్రో తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరినీ ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని ఆదేశించారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఆయన తరఫున పిటిషన్ దాఖలు చేయగా, బుష్రా బీబీ కుమార్తె ముబష్షిరా ఖవర్ మనేకా తన తల్లి తరఫున కోర్టును ఆశ్రయించారు (Imran Khan family meeting).
ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ కలుసుకునేందుకు కూడా జైలు అధికారులు ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. జైలు నిబంధనలకు అనుగుణంగా ఇమ్రాన్ ఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ తన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా జైలు అధికారులను ఆదేశించింది (Imran Khan solitary confinement).
ఇమ్రాన్ ఖాన్కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య సదుపాయాలను కూడా అందించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యతను ఆడియాలా జైలు సూపరింటెండెంట్కు అప్పగించింది. అమలు చేసిన వివరాలతో 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వైరల్
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల