కుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి అక్రమంగా తరలింపు.. స్పృహలోకి వచ్చాక రచ్చ రచ్చ.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:10 PM
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. పెంపుడు కుక్కను ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలించేందుకు ఒక జంట దానికి నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉంచడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మెలుకువ వచ్చిన తర్వాత అయోమయానికి గురైన ఆ కుక్క కోచ్లో తిరుగుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు వెంటనే ఆ జంటను కిందకు దింపేశారు.
సాధారణంగా రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లాలంటే ప్రత్యేక నిబంధనలు, అనుమతులు ఉంటాయి. అయితే, ఆ ఇబ్బందులు ఏవీ లేకుండా తప్పించుకోవాలని భావించిన ఒక జంట, తమ పెంపుడు కుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి దించింది. అనంతరం దానిని ఎవరికీ అనుమానం రాకుండా బెర్త్ కింద దాచి అక్రమంగా ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణం మధ్యలో మత్తు వదిలిన ఆ కుక్క ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. రైలు ప్రయాణం ఆ కుక్కకు విచిత్రంగా అనిపించింది. ఏం జరుగుతుందో అర్థం కాక కోచ్లో అటు ఇటు తిరుగుతూ విలవిలలాడింది. భయంతో అరిచింది, దాని ప్రవర్తన చూసి తోటి ప్రయాణికులు ఎంతో జాలిపడ్డారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించి కుక్కను అక్రమంగా తరలిస్తున్నందుకు, ఆ జంటను తదుపరి స్టేషన్లో రైలు నుంచి కిందకు దింపేశారు. దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telangana News And International News And Telugu News