Share News

కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:08 PM

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తారు. పర్వతాల మధ్య క్లిష్టమైన మార్గంలో రోజుల తరబడి ఈ యాత్ర సాగుతోంది. ఓ మహిళ కృత్రిమ కాలుతో ఈ యాత్ర చేస్తుంది.

కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తారు. పర్వతాల మధ్య క్లిష్టమైన మార్గంలో రోజుల తరబడి ఈ యాత్ర సాగుతోంది. ఓ మహిళ కృత్రిమ కాలుతో ఈ యాత్ర చేస్తుంది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆమె స్ఫూర్తికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రా చేయాలంటే ముందే పేరు నమోదు చేసుకోవాలి. వాతావరణం ఎప్పుడూ ఎలా మారుతుందో తెలియదు. అందుకే ఈ యాత్ర చేసేందుకు చిన్నారులు, వృద్ధులకు అనుమతి ఇవ్వరు.


అయితే కృత్రిమ కాలుతో యాత్ర చేస్తున్న మహిళ పేరు నేహా భట్టా. ఈ యాత్రలో ఇప్పటికే ఆమె బల్తాల్ మార్గాన్ని పూర్తి చేశారు. గతంలో రోడ్డు ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కృత్రిమ కాలుతోపాటు రెండు చేతి కర్రల సహాయంతో ఆ కఠినమైన మార్గంలో యాత్ర చేస్తుంది. నేహాకు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు సహాయం చేసేందుకు ఆమె వెంట ఓ వ్యక్తి కూడా నడుస్తున్నాడు. ఈ వీడియోను నేహా.. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ‘ampu_tea_nehaa’ పంచుకుంది.


ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికి లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. పెద్ద సంఖ్యలో ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. ఆమె ముఖంలో చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉందని అంటున్నారు. ఆమె చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ యాత్ర చేస్తూ ఆమె ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 03:26 PM