గౌర్మెట్ పాప్కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
ABN, Publish Date - Aug 25 , 2026 | 08:05 AM
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సోమవారం గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాక్టరీని, పాప్ కార్న్ తయారీ విధానాన్ని పరిశీలించారు.
1/15
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సోమవారం గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు
2/15
అనంతరం ఫ్యాక్టరీని, పాప్ కార్న్ తయారీ విధానాన్ని వారు పరిశీలించారు.
3/15
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, కొలుసు పార్థసారధి, కింజరాపు అచ్చెన్నాయుడు, గార్మె పాప్ కార్నికా ఎండీ ఎస్బీపీ పట్టాభిరామారావు, అధికారులు పాల్గొన్నారు.
4/15
ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రసంగించారు. రెండు నెలల క్రితం ఓ తమిళ పత్రికలో గౌర్మెట్ సంస్థ ఎండీ పట్టాభి సక్సెస్ స్టోరీని చదివానని ప్రస్తావించారు. ఒకే ఒక ఉత్పత్తిని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడంతో ఆయనను అభినందిస్తున్నానని ఉపరాష్ట్రపతి అన్నారు.
5/15
ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మన దేశానికి రైతులే వెన్నెముక అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17శాతమని పేర్కొన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా, వ్యవసాయం దానిని స్థిరీకరించిందని తెలిపారు. శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలను పరిశోధించాలని సూచించారు.
6/15
ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
7/15
వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రాసెసింగ్ విలువలు జోడించి ఓ మంచి బ్రాండ్తో అంతర్జాతీయ మార్కెట్లకు తరలిద్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పుడే దీని విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
8/15
‘స్వదేశీ విధానంతో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయంసమృద్ధి సాధించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నదే కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాల ఆలోచన’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
9/15
వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా, రైతులను పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నదే తమ సంకల్పమని సీఎం అన్నారు.
10/15
రైతులు ఉత్పత్తి చేసే పంటలకు విలువలను జోడించి ఎగుమతి చేయాలన్నదే ప్రభుత్వాల ధ్యేయమని సీఎం చంద్రబాబు తెలిపారు.
11/15
పసుపు, మిరప, మొక్కజొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్కు చేరాలని సీఎం ఆకాంక్షించారు.
12/15
ఆసియా మార్కెట్ నుంచి ప్రపంచంలోని పాప్కార్న్ గ్లోబల్ మార్కెట్ను విస్తరించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందని సీఎం ఆకాంక్షించారు.
13/15
దేశీయంగా మొక్కజొన్న విత్తన ఆవిష్కరణ శుభ పరిణామమని సీఎం చంద్రబాబు తెలిపారు. మామూలుగా పనిచేస్తే జీవితాలు మూమాలుగానే ఉంటాయని... వినూత్నంగా పనిచేస్తేనే ఎదుగుదల సాధిస్తామని గౌర్మెట్ నిరూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
14/15
'గౌర్మెట్ పాప్ కార్నికా' విత్తన ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.
15/15
మొక్కజొన్న రైతుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.
Updated at - Aug 25 , 2026 | 08:31 AM