Share News

Kanpur: మాయమాటలు చెప్పి నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. చివరకు..

ABN , Publish Date - Jan 02 , 2026 | 07:42 AM

ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...

Kanpur: మాయమాటలు చెప్పి నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిని ఓ డాక్టర్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయడమే కాదు.. ఏకాంత సమయాన్ని ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పపడ్డాడు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పపడిన ఆ వైద్యుడిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం.. అతడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డీసీపీ విశ్వజిత్ శ్రీవాస్తవ తెలిపారు. నర్సింగ్ విద్యార్థిని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తామన్నారు. బాధితురాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చేస్తోంది.


నిందితుడైన డాక్టర్, సదరు విద్యార్థినిని తన గదిలోకి పిలిచి వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పపడినట్లు నర్సింగ్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కియాసెర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆ వైద్యుణ్ని కోరగా.. అతడు నిరాకరించడమే కాకుండా తన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధితురాలితో మాట్లాడినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం

Updated Date - Jan 02 , 2026 | 09:44 AM