ట్రైన్ ఆలస్యమైతే ఫుడ్ ఫ్రీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:38 PM
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ రైళ్లు రెండు గంటలకు మించి ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఉంటుంది. అంతేకాకుండా.. మూడు గంటలకు మించి ఆలస్యం అయితే టికెట్ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ (TDR) కూడా పొందవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందిస్తోంది. ముఖ్యంగా రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు రెండు గంటలకు మించి ఆలస్యం అయితే ప్రయాణికులకు ఉచిత భోజనం ఇవ్వాల్సిందే. ఇటీవల ఒక రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఆరు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికుడికి ఉచిత భోజనం అందించారు. IRCTC క్యాటరింగ్ పాలసీ ప్రకారం రైల్వే శాఖ ఈ సౌకర్యం అందిస్తోంది.
ఉచిత భోజనం ఎప్పుడు ఇస్తారు?
రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లు తమ షెడ్యూల్ టైమ్ కంటే 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే రైల్వేలు ఉచితంగా ఆహారం ఇవ్వాలి. ఈ రైళ్ల టికెట్ ధరలోనే భోజన ఖర్చు కలిపి ఉంటుంది కాబట్టి ఈ సౌకర్యం వర్తిస్తుంది.
ఏం ఇస్తారు?
ఉదయం లేదా సాయంత్రం ఆలస్యం అయితే టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు ఇస్తారు.
అల్పాహారం సమయానికి బ్రెడ్, వెన్న, జ్యూస్ ఇస్తారు.
మధ్యాహ్నం లేదా రాత్రి ఆలస్యం అయితే అన్నం, పప్పు, రాజ్మా లేదా చోలే, ఊరగాయ ఇస్తారు.
కొన్ని సందర్భాల్లో పూరీలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా ఇస్తారు.
రైలు 3 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే?
మూడు గంటలకు మించి రైలు ఆలస్యమైతే టికెట్ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ (TDR) కూడా పొందవచ్చు. అలాగే స్టేషన్లలోని వెయిటింగ్ రూమ్లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో మంచు కారణంగా రైళ్లు ఆలస్యం అయ్యే సమయంలో ఈ సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది.
ఆన్లైన్లో TDR ఎలా దాఖలు చేయాలి?
రైలు ప్రారంభ స్టేషన్ నుంచి 3 గంటలకు మించి ఆలస్యం అయితే, మీరు ఆ రైలులో ప్రయాణించకపోతే TDR దాఖలు చేసి పూర్తి రీఫండ్ పొందవచ్చు.
TDR దాఖలు చేసే విధానం:
IRCTC వెబ్సైట్ లేదా యాప్లో యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి.
మై అకౌంట్లోకి వెళ్లి → మీరు బుక్ చేసిన టికెట్ల వివరాలపై క్లిక్ చేయండి.
‘ఫైల్ TDR’ ఆప్షన్ ఎంచుకోండి.
సంబంధిత PNR నంబర్ సెలెక్ట్ చేయండి.
అనేక కారణాలు అందులో ఉంటాయి. రైలు ఆలస్యం అయితే, రైలు మూడు గంటలకు పైగా ఆలస్యంగా వచ్చింది, ప్రయాణీకులు ప్రయాణించలేదు అనే ఆప్షన్ను ఎంచుకోండి.
సబ్మిట్ చేస్తే కన్ఫర్మేషన్ వస్తుంది.
TDR దాఖలు చేసిన తర్వాత రైల్వే అధికారులు దాన్ని పరిశీలించడానికి 15 నుంచి 90 రోజులు పడుతుంది. రీఫండ్ మొత్తం మీరు టికెట్ బుక్ చేసినప్పుడు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోనే నేరుగా జమ అవుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బాస్మతి బియ్యం వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!
పానిక్ అటాక్ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News