సెల్ఫోన్లో మాట్లాడుతూ..
ABN , Publish Date - May 08 , 2026 | 12:48 AM
స్థానిక మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామం వద్ద బుధవారం రాత్రి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మేడపై నుంచి జారిపడి కురిటి వినోద్(33) మృతి చెందాడు.
మేడపై నుంచి జారిపడి యువకుడు మృతి
పలాస, మే 7(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామం వద్ద బుధవారం రాత్రి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మేడపై నుంచి జారిపడి కురిటి వినోద్(33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. వినోద్కుమార్ మేడపై నిద్రించ డానికి వెళ్లాడు. ఈ క్రమంలో సెల్ఫోన్లో మాట్లాడుతూ జారి పడి మృతి చెం దాడు. గురువారం ఉదయం తన భర్త ఎంతకీ కిందికి రాలేదని భార్య చూడగా అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆయన్ని పరిశీలించగా.. మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి చెవిలో ఇయర్బడ్డ్, చేతిలో సెల్ ఫోన్ ఉండడాన్ని పోలీసులు గుర్తిం చారు. ఎస్ఐ నర్సింహమూర్తి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వినోద్కి భార్య రినీష, మూడేళ్ల వయస్సు గల కుమార్తె ఉండగా.. ప్రస్తుతం రినీష ఏడు నెలల గర్భవతి.
కారు ఢీకొని రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ మృతి
పలాస, మే 7(ఆంధ్రజ్యోతి): జాతీయరహదారి రామకృష్ణాపురం గ్రామం వద్ద కారు ఢీకొన్న ఘటనలో రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ అన్నాబత్తుల వెంకటరమణ(67) గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరమణ స్వగ్రామం నుంచి పలాస వైపు వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరమణకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటన స్థలానికి కాశీబుగ్గ పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. కాగా ఆర్టీసీ సంస్థలో ఉత్తమ డ్రైవరుగా వెంకటరమణ అనేకసార్లు అవార్డులను అందుకున్నారు.
పాముకాటుతో మహిళ..
వజ్రపుకొత్తూరు, మే 7(ఆంధ్రజ్యోతి): కొండవూరు గ్రామానికి చెందిన ఏదళ్ల ఆదమ్మ (55) పాము కాటుకు గురై మృతిచెందింది. బుధవారం సాయంత్రం ఉపాధి పని నుంచి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో పాముకాటు వేసినట్లు గ్రామస్థులు చెప్పారు. వెంటనే పూండిలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించినప్పటికి ఆదమ్మ బుధవారం రాత్రి మృతిచెంది. ఆదమ్మ భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందగా.. ప్రస్తుతం కుమారుడి వద్ద ఉంటుంది.