Share News

వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి ఐదేళ్లు రాష్ట్రం నాశనమైంది: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Jun 18 , 2026 | 02:39 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి కోసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా అడ్డుకున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి ఐదేళ్లు రాష్ట్రం నాశనమైంది: మంత్రి గొట్టిపాటి
AP Minister Gottipati Ravi Kumar

ఒంగోలు, జూన్18: వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనమైందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఇచ్చిన ఐదేళ్లు వైఎస్ జగన్ ఇంట్లో నిద్రపోయారని వ్యంగ్యంగా అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారని ఆరోపించారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డి పార్టీకే సొంతమన్నారు.


గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇచ్చిన హామీలతోపాటు అభివృద్ధి చేసి చూపించడంతో కూటమిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని తెలిపారు. పెన్షన్ల కోసం రూ.33 వేల కోట్ల ఖర్చు పెడుతున్నామని వివరించారు. విద్య కోసం రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 16 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చామని గుర్తు చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. ఒక ప్రాంతంలో కూడా రహదారి నిర్మాణం చేపట్టలేదన్నారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశానంటూ ప్రజలను మోసం చేశారంటూ జగన్‌‌పై విమర్శలు గుప్పించారు.


కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతి నెల వెలిగొండ ప్రాజెక్టును పరిశీలిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. వెలిగొండ ముంపు గ్రామాల ప్రజలకు రూ.900 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. రాబోయే రోజుల్లో కూటమిలోని పార్టీల నేతలు ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమవుతారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు.


ఇవి కూడా చదవండి..

అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాశ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 02:50 PM