Home » Gottipati Ravi Kumar
దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు.
తుఫాన్ సమయంలో ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దాదాపు 1500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు.
మొంథా తుపానుని ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు.
విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని మంత్రి తెలిపారు. అనైతిక విధానాలతో వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలపై జగన్ 18వేల కోట్ల భారం మోపారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ నిర్వహణకు నిధులు కేటాయించారని ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. ప్లాంట్ నుంచి కాలుష్యం పరిమితికిమించి విడుదల అవుతోందని.. విద్యుత్ ప్లాంట్ అమరావతికి కూడా అతి సమీపంలో ఉందని తెలిపారు.
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సభతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిందని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.
వినాయక చవితి సందర్భంగా భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
AP Heavy Rains: వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.