Home » Gottipati Ravi Kumar
ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(REMZ) ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు పారదర్శకంగా రూ.31.57 కోట్ల పరిహారం అందించామని చెప్పారు.
విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పవర్ సెక్టార్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు.
ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఎల్ నినో ప్రభావంతో తగ్గిన జల విద్యుత్ ఉత్పత్తితో ఇబ్బందులు లేకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు.
ఏపీలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు వేశారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచితే.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.