Share News

తుది దశకు నకిలీ మద్యం కేసు కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి

ABN , Publish Date - Sep 16 , 2026 | 07:00 AM

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. కోర్టు వారికి సెప్టెంబరు 28 వరకు రిమాండ్‌ విధించడంతో ఎక్సైజ్‌ పోలీసులు కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

తుది దశకు నకిలీ మద్యం కేసు కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
Mulakalacheruvu fake liquor case

ములకలచెరువు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో లొంగిపోయారు.


న్యాయమూర్తి సుబహాన్‌ వీరికి ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులను ఎక్సైజ్‌ పోలీసులు కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ గుట్టును గతేడాది అక్టోబరు 3న ఎక్సైజ్‌ అధికారులు రట్టు చేశారు. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో దాసరిపల్లె జయచంద్రారెడ్డి(ఏ17), ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి (ఏ18)గా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అలయ్‌ బలయ్‌కు రండి: బాబుకు దత్తన్న ఆహ్వానం
రేపు వారాణసికి సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 07:01 AM