Share News

పెరిగిన తెల్ల బంగారం ధర

ABN , Publish Date - May 05 , 2026 | 01:12 PM

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.

పెరిగిన తెల్ల బంగారం ధర
Cotton Prices

  • ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి రూ.9,615

ఆదోని(కర్నూలు): కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది. ఇప్పటికే పత్తి సీజన్‌ ముగియడంతో అరకొర పత్తి రైతులు విక్రయానికి తీసుకొస్తుండడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు.


pandu5.3.jpgఅంతర్జాతీయ మార్కెట్‌లోనూ దూది ధరలు పెరి గాయని, దీంతో స్థానిక మార్కెట్‌ యార్డులో ధరలు పెరగడానికి మరో కారణమని తెలిపారు. ధరలు పెరగడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 758 క్వింటాల పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠ ధర రూ.9615, మధ్యస్థం రూ.9,300 కనిష్ఠం రూ.5,525 పలికింది.


pandu5.jpgఈ వార్తలు కూడా చదవండి:

బియ్యం..కయ్యం.. రేషన్‌ డీలర్లు వర్సెస్‌ సీఎస్‌ డీటీలు

పెట్టుబడుల హబ్‌గా ఏపీ.. మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

Read Latest Telangana News and National News

Updated Date - May 05 , 2026 | 01:12 PM