Share News

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన.. మండలి వాయిదా

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:36 PM

ఏపీ శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన.. మండలి వాయిదా
AP Legislative Council

అమరావతి, మార్చి 4: ఏపీ శాసనమండలిలో(AP Legislative Council) గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను రేపటికి(గురువారం) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.


అంతకముందు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మండలిలో రగడ చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌ను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళకు దిగారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తర్వాత కూడా.. జగన్‌కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘జగన్‌ను నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు.


జగన్ క్రిస్టియన్ కాదని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. ‘టీవీలో చూసి ఉంటారు కదా జగన్... కాదని చెప్పమనండి’ అని మంత్రి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబంతో తిరుమల దర్శనానికి ఎందుకు రాలేదని నిలదీశారు. వైసీపీ సభ్యులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రసంగించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.320లకు కిలో ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా?’ అని ప్రశ్నించారు. వీళ్లు హిందువులు ఎలా అవుతారంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. రూ.320లకు ఆవు నెయ్యి కొనాలని అడుగుతున్న వైసీపీ సభ్యులు.. ఎమ్మెల్సీలు ఎలా అయ్యారని నిలదీశారు. సోమువీర్రాజు మాట్లాడుతున్న సమయంలో పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను గురువారానికి(మార్చి 5) వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి..

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ

వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేశ్ ధీటుగా సమాధానం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 05:06 PM