Share News

ఏపీ కేబినెట్‌ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ కేబినెట్‌ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు
AP Cabinet Meeting In Amaravati

అమరావతి, ఆగస్టు18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవి..

  • కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

  • చట్టంలోని నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ స్థానిక సంస్థలు (ULBs), గ్రామీణ స్థానిక సంస్థలు (RLBs) ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

  • గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపింది.


  • పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

  • ఏపీ పంచాయితీరాజ్ చట్టం-1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది.

  • ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.


  • బీసీ రిజర్వేషన్లకు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని కేబినెట్‌ దృష్టికి ఉన్నతాధికారులు వెల్లడించారు.

  • పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

  • నగర, పట్టణ, నగర పంచాయితీల్లోని మేయర్, చైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది.


  • ఇప్పటి వరకూ ఉన్న 13 జిల్లా పరిషత్‌ల సంఖ్యను 28కి పెంచాలని నిర్ణయం తీసుకుంది.

  • జిల్లాల విభజనకు అనుగుణంగా జెడ్పీలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.


  • ఈ ఏడాది అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం

  • ఆర్థిక సంఘం నిధులు రూ.16,500 కోట్లు మరిగిపోకుండా ఉండేందుకు చర్యలు

  • మేయర్‌ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం


  • పాత పద్ధతిలో ఓ డిప్యూటీ మేయర్‌కే పరిమితం కావాలని నిర్ణయం

  • కర్నూలులో అగస్త్య గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

  • 12 గిగావాట్ల సిలికాన్‌ ఇంగాట్‌, వేఫర్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్


  • విశాఖలో అక్షత్‌ గ్రీన్‌టెక్‌ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ ప్లాంట్‌, డేటా సెంటర్ల ప్రతిపాదనలు, SIPB నిర్ణయాలకు ఆమోదం.

  • తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు ఆమోద ముద్ర.

  • అమరావతి రైల్వేలైన్‌కు ల్యాండ్‌ పూలింగ్‌పై నిర్ణయం.


  • హ్యామ్‌ మోడల్‌లో రోడ్లు, పార్కుల అభివృద్ధిపై నిర్ణయం.

  • 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనపై నిర్ణయం

  • బీసీ విద్యార్థుల కోసం జేఈఈ, నీట్‌ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌


  • ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు ఆమోదం.

  • ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్‌ బిల్లుకు ఆమోదం.

  • APSBCLకు రూ.5 వేల కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణం ప్రతిపాదనకు ఆమోదం.


  • అవయవ మార్పిడికి సంబంధించి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ బిల్లుకు ఆమోదం.

  • పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై ఈ కేబినెట్‌లో విస్తృతంగా చర్చ జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్

For More AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 03:35 PM