Share News

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:11 PM

జనసేన పార్టీ యువజన విభాగానికి జై కొట్టు అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జై కొట్టు లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ
Janasena Youth Wing

కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. ఈరోజు(బుధవారం) కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు.


ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నియంత జగన్‌ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పనిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ

కాలికి గాయంతో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన వ్యక్తి.. కాసేపటికే

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 01:14 PM