ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 13 , 2026 | 01:34 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అమరావతి, జులై 13: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందనే దానిపై చంద్రబాబు ఆరా తీయగా.. 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందని అధికారులు వివరించారు. కాల్వలకు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని అడుగగా.. 14,700 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదిలామని అధికారులు చెప్పారు. కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. చివరి భూములకు నీరందేలా చూసే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి, కోనసీమ అందాల సీమ అని పేరుందని... దాన్ని నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం.. అప్పలరాజు కుమారుడే బైక్ నడిపినట్లు పోలీసుల నిర్ధారణ
ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు.. ఓపీఎస్ ఎంపికకు వన్టైమ్ ఛాన్స్
Read Latest AP News And Telugu News