Home » Andhra Pradesh Exit Poll Results
సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మరో ఇద్దరు పోలీసులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరో ముందడుగు వేసింది. తానా ఆధ్వర్యంలో తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు.
అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు.
అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందని ఏపీ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాధవ్ పాల్గొన్నారు.
పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో రైతులకు ఒక భద్రత ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం కలిగించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోగలం అనే నమ్మకాన్ని కల్పించామని తెలిపారు.
AP Tourism: పర్యాటక రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ రంగం ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ "మన ఊరి కోసం మాటామంతీ" పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా ముచ్చటించనున్నారు.
Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.