Home » Andhra Pradesh Exit Poll Results
అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందని ఏపీ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాధవ్ పాల్గొన్నారు.
పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో రైతులకు ఒక భద్రత ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం కలిగించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోగలం అనే నమ్మకాన్ని కల్పించామని తెలిపారు.
AP Tourism: పర్యాటక రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ రంగం ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ "మన ఊరి కోసం మాటామంతీ" పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా ముచ్చటించనున్నారు.
Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.
Angani fire on YSRCP: ఏపీ శాసనమండలిలో వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని, లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
Lanka Dinakar: నదుల అనుసంధానంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కృష్ణా నదిలో ఆ స్థాయిలో నీటి లభ్యత కష్టంగా మారిందని చెప్పారు. ఈ తరుణంలో వెలిగొండ వరకు నదుల అనుసంధానం చేయడం ద్వారా 23 లక్షల మందికి తాగు నీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునే సమయంలో అంబటి ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అంబటిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.