ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం..

ABN, Publish Date - Nov 04 , 2025 | 01:02 PM

తిరుపతి విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి.

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU)లో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు తమ బాధను HOD దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, విచిత్రంగా ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థుల పట్ల HOD అనుచితంగా మాట్లాడారని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక

Updated at - Nov 04 , 2025 | 01:02 PM