సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ
ABN, Publish Date - Feb 07 , 2025 | 03:07 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ అవనున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, పయ్యావుల చర్చించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాను సీఎం చంద్రబాబు, పయ్యావుల కలిసిన విషయం తెలిసిందే.
మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
అన్నా క్యాంటీన్లో అమ్మ రాజశేఖర్ సందడి..
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళ పెట్రోల్ బాటిల్తో హల్ చల్
అంబటి ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్
అంబటి ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 07 , 2025 | 03:07 PM