Srisailam Dam: శ్రీశైలం డ్యాంకు పొంచివున్న మరో భారీ ప్రమాదం
ABN, Publish Date - Mar 07 , 2025 | 10:45 AM
శ్రీశైలం జలాశయంలో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకు పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం నిలదీసింది.
శ్రీశైలం జలాశయంలో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకు పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం నిలదీసింది. రూ. 480 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో శ్రీశైలం ప్లంజ్పూల్తో పాటు గుండ్లకమ్మ, రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్ట్ల మరమ్మతులపై కదలిక లేకపోవడంతో గురువారం ఆంధ్ర, తెలంగాణ అధికారులతో కేంద్ర జల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2009 అక్టోబర్లో సంభవించిన భారీ వరదలకు శ్రీశైలం ట్రస్ట్ గేట్లు ఎత్తినప్పుడు దిగువకు నీరు జాలువారే ప్లంజ్పూల్ ప్రాంతంలో భారీ గోయి ఏర్పడింది. ఇది 120 మీటర్ల లోతు,270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉన్నట్లు నిఫుణులు, ఇంజనీర్లు గతంలోనే అంచనా వేశారు. దీని కారణంగా డ్యాంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వీటితో పాటు గుండ్లకమ్మ, రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్ట్ల మరమ్మతులకు రూ. 480 కోట్ల ఆర్థిక సాయం అందజేయడానికి ప్రపంచ బ్యాంకు ఇదివరకే ముందుకు వచ్చింది.
Updated at - Mar 07 , 2025 | 10:45 AM