Share News

Operation Sindoor: మావోల వేటకు విరామం.. బార్డర్‌‌కు బలగాలు

ABN , Publish Date - May 10 , 2025 | 11:08 AM

Operation Sindoor: కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు కాస్త విరామం పడింది. ఆపరేషన్ కగార్‌‌పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్‌ పడింది. వెంటనే బార్డర్‌కు వెళ్లాల్సిందిగా సీఆర్పీఎఫ్‌ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Operation Sindoor: మావోల వేటకు విరామం.. బార్డర్‌‌కు బలగాలు
Operation Sindoor

వరంగల్, మే 10: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు (Operation Kagar) తాత్కాలిక బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ (Operationa Sindoor) ఎఫెక్ట్ పడింది. భారత్ - పాకిస్థాన్ వార్ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులను ఏరివేసేందుకు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్‌ బలగాలు వెనక్కి రావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు విరామం పడింది. దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రిప్పిస్తోంది. కర్రెగుట్టల నుంచి బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్ట‌ర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు హుటాహుటిన వెనుతిరుగుతున్నాయి.


ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలకు రిలీవ్ ఇచ్చారు. కేంద్రం ఆదేశాల మేరకు రేపు (ఆదివారం) ఉదయంలోగా భారత్- పాక్ బార్డర్‌కు బలగాలు వెళ్లనున్నాయి. కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్‌ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ఆగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ కొనసాగిస్తున్నారు. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఫారెన్ సెక్రటరీ ప్రెస్ మీట్


అలాగే కర్రెగుట్టల్లో బంకర్లను ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లడపడుతున్నాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న కూంబింగ్‌లో పలువురు మావోయిస్టులు తారసపడటంతో ఎన్‌కౌంటర్లు జరిగాయి. చాలా మంది మావోయిస్టులు మరణించారు కూడా. అలాగే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు గ్రౌహౌండ్స్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కోసం మరింతగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో బలగాలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ బలగాను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. దీంతో బార్డర్‌కు వెళ్లేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలను వీడుతున్నారు.


ఇవి కూడా చదవండి

Young Doctor Drug Case: డీజేతో పరిచయం... కొకైన్‌కు బానిస.. యువవైద్యురాలి కథ ఇదీ

Harish Support To Soldiers: ఓపికకు హద్దు ఉంటుంది.. ఇక సహించం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 11:45 AM