Harish Support To Soldiers: ఓపికకు హద్దు ఉంటుంది.. ఇక సహించం
ABN , Publish Date - May 10 , 2025 | 10:40 AM
Harish Support To Soldiers: సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా అని... దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారని హరీష్ రావు తెలిపారు. పాకిస్థాన్..భారత దేశం నుంచి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు.

హైదరాబాద్, మే 10: భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సహనానికి, ఓపికకు హద్దు ఉంటుందని.. చాలా సంవత్సరాలు ఓపికగా చూశామని... ఇప్పుడు భరించేది లేదని దేశ ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలచి వేసిందన్నారు. ఇలాంటి సమయంలో దేశంలోని ప్రతీ యువతీ యువకుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైనికుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉందన్నారు. ‘మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధత మాకు గర్వకారణం, మీ పోరాటం మాకు స్ఫూర్తి, భారత దేశ సైనికులను చూసి గర్వపడుతున్నాం’ అని అన్నారు.
సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా అని... దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్.. భారత దేశం నుంచి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. ముంబైలో తాజ్ హోటల్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారన్నారు. వారు పాకిస్థాన్ పంపిన ఉగ్రవాదులు అని ప్రపంచం ముందు ఆ దేశాన్ని దోషిగా నిలబెట్టింది భారతదేశం అని తెలిపారు. అమెరికా లాంటి దేశాలపై కూడా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి దాడులకు తెగబడ్డారన్నారు. భారతదేశం మీద జరుగుతున్న దాడికి పరిష్కారం చూపిస్తూ ఉగ్రవాదులపై దాడి చేయడం సరైన చర్య అని వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్లో పెట్రోల్ బంకులు క్లోజ్..
యుద్ధానికి అవసరం పడితే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ కూడా ముందుకు రావాలన్నారు. సైనికుల కోసం రక్తదానానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బార్డర్లో మనం పోరాటం చేయకపోవచ్చు కానీ సైనికులకు అవసరమైనటువంటి రక్తాన్ని, వైద్యాన్ని అందించే బాధ్యత దేశ ప్రజలపై ఉందని తెలిపారు. సైనికుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉందన్నారు. ‘భారత సైనికుల్లారా మీరు బార్డర్లో మా కోసం పోరాటం చేస్తున్నారు. మీ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. జై భారత్... జైహింద్’ అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Young Doctor Drug Case: డీజేతో పరిచయం... కొకైన్కు బానిస.. యువవైద్యురాలి కథ ఇదీ
Police Alert: హైదరాబాద్లో పోలీస్ నిఘా
Read Latest Telangana News And Telugu News