Police Alert: హైదరాబాద్లో పోలీస్ నిఘా
ABN , Publish Date - May 10 , 2025 | 04:55 AM
భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న బీకర దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రోజురోజుకూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు.. అసాంఘిక శక్తులపై ఆరా..!
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు!
అడుగడుగునా తనిఖీలు.. సందర్శకుల పాసులు రద్దు
హైదరాబాద్ సిటీ/శంషాబాద్ రూరల్, మే 9 (ఆంధ్రజ్యోతి): భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న బీకర దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రోజురోజుకూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సౌత్ జోన్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ జోన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పాతనగరంలోని పలు సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై పర్యవేక్షణ చేస్తున్నారు. భద్రత, బందోబస్తుపై స్థానిక పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు.సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో ఆసి్ఫనగర్ డివిజన్ పోలీసులు మిరాజ్ ఎక్స్రోడ్డు నుంచి మల్లేపల్లి ఎక్స్రోడ్డు వరకు పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని, ఎలాంటి పరిస్థితులెదురైనా తాము అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. మిరాజ్ ఎక్స్రోడ్డు నుంచి మల్లేపల్లి ఎక్స్రోడ్డు వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. మరోవైపు.. నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రౌడీషీటర్లు, అల్లరిమూకలు, అరాచక శక్తులకు సిటీ పోలీసులు తీవ్రంగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.
శంషాబాద్ ఎయిర్పోర్టులో హైఅలర్ట్
భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. సీఐ బాల్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10.45 గంటలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ‘మేము పాకిస్థాన్ స్లీపర్ సెల్స్.. ఏ క్షణంలోనైనా ఎయిర్పోర్టును పేల్చి వేస్తాం‘ అని ఆర్జీఐ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా బలగాలు, సీఐఎ్సఎఫ్, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు, అప్రమత్తమయ్యారు. ఏటీసీ టవర్, అరైవల్, డిపాచర్, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్లతో తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు లేదని నిర్ధారించిన తరువాత వచ్చింది ఫేక్ మెయిల్ అని అధికారులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎ్సఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలతో 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రత బలగాలు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తున్నారు. సందర్శకుల పాసులను రద్దు చేశారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీనగర్, అమృత్సర్, జోఽథ్పూర్, చండీగఢ్, రాజ్కోట్ వెళ్లే విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశామని జీఎంఆర్ అధికారులు తెలిపారు.
ఆర్మీకి డొనేషన్లు ఇవ్వాలని నకిలీ లింకులు
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆర్మీకి విరాళాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు లింకులు పంపుతున్నారు. ఆ వెబ్సైట్లను ఓపెన్ చేస్తే ఖాతాలు హ్యాక్ అవుతాయని సైబర్ క్రైం అధికారులు చెబుతున్నారు. సైన్యానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే నేరుగా డిఫెన్స్ ఫండ్కు చెల్లించవచ్చని, ఇతర లింకులను ఓపెన్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూ రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అదను చూసి దండుకోవడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వేల లింకులను సోషల్ మీడియాలో పెట్టారని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News