Airport to Srisailam: ఎయిర్పోర్ట్ టు శ్రీశైలం..
ABN , Publish Date - Aug 26 , 2025 | 09:23 AM
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్జీఐఏ బోర్డింగ్ పాయింట్కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- ప్రత్యేక బస్సులు నడపనున్న టీజీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ: శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam) వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్జీఐఏ బోర్డింగ్ పాయింట్కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, tgsrtcbus.in వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోచ్చన్నారు. రిజర్వేషన్ సమయంలో ఆర్జీఐఏ క్రాస్రోడ్ బోర్డింగ్ పాయింట్ను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News