Share News

Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్ మృతి

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:41 PM

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్‌ మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్ మృతి
Hyderabad Road Accident

హైదరాబాద్, డిసెంబర్ 26: అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లాకు చెందిన పునీత్ యాదవ్ (23) గౌలిదొడ్డిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై పునీత్, అతడి స్నేహితుడితో కలిసి గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలికి వస్తున్నాడు. అయితే పునీత్ వేగంగా బైక్‌ను నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.


ఈ క్రమంలో పునీత్, అతడి స్నేహితులు కిందపడిపోయారు. అయితే బైక్‌ నడుపుతున్న పునీత్ యాదవ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న అతడి స్నేహితుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే పునీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త.. అడ్డుకోబోయిన కూతురిని కూడా

ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 01:21 PM