Congress: తెలంగాణ కాంగ్రెస్ ధర్నా.. ఎందుకంటే
ABN , Publish Date - Feb 01 , 2025 | 10:10 PM
Congress: 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం నాడు ధర్నాకు పిలుపునిచ్చింది.
హైదరాబాద్: కేంద్ర వార్షిక బడ్జెట్ (2025-26)ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) ప్రకటించారు . మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు. వివిధ శాఖల వారీగా చూసుకుంటే.. రక్షణ శాఖకు ఏకంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా ధర్నాకు రేపు(ఆదివారం) తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నాకు పిలుపునిచ్చింది.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీ స్థానిక అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డిసీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao on Union Budget: దేశమంటే కొన్ని రాష్ట్రాలేనా.. బడ్జెట్పై హరీష్ విమర్శలు
Etela Rajender : కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
Congress MLA's: కాంగ్రెస్ నేతల రహస్య సమావేశం.. వాళ్లే టార్గెట్గా..
Revanth Reddy: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. కారణమిదే..
Read Latest Telangna News And Telugu News