Road Accident: టిప్పర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 22 మందికి గాయాలు..
ABN , Publish Date - Dec 27 , 2025 | 09:51 PM
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది ప్రాంతం వద్ద NH–65పై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 22 మంది గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది ప్రాంతం వద్ద NH–65పై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 22 మంది గాయపడ్డారు. బస్సు మెదక్ నుంచి పటాన్చెరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరికీ స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డ్రగ్స్ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్
Read Latest Telangana News And Telugu News