ఐపీఎల్పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఊహించని విధంగా..
ABN , Publish Date - May 09 , 2025 | 12:35 PM
Indian Premier League: ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మిగతా మ్యాచుల నిర్వహణపై బోర్డు క్లారిటీ ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. భారత్-పాకిస్థాన్ యుద్ధం అంతకంతకూ ముదురుతుండటంతో ఐపీఎల్-2025ను కొనసాగిస్తారా.. లేదా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. భద్రతా కారణాల రీత్యా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసింది బీసీసీఐ. దీంతో పూర్తి సీజన్ను నిలిపివేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్లే ఇవాళ మీటింగ్ తర్వాత ఐపీఎల్-2025ను ప్రస్తుతం వారం రోజుల పాటు వాయిదా వేసింది. మిగతా మ్యాచులు జరుగుతాయా.. లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పడంతో ఇక ఈ సీజన్ క్లోజ్ అయినట్లేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ విషయంలో బీసీసీఐ మరింత స్పష్టత ఇస్తుందేమో చూడాలి. యుద్ధ పరిస్థితులు చల్లబడ్డాక టోర్నీ నిర్వహణ విషయంలో తమ నిర్ణయాన్ని బోర్డు పెద్దలు మార్చుకుంటారా అనేది చెప్పలేం.
ఇవీ చదవండి:
చీర్లీడర్ షాకింగ్ వీడియో వైరల్..
ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్లో వార్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి