Share News

Operaion Sindoor: ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

ABN , Publish Date - May 09 , 2025 | 11:07 AM

Operaion Sindoor: దేశానికి డబ్బులు కావాలంటూ పాక్ ప్రజలు ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తులు చేస్తూ ట్యాగ్‌లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. వద్దని ఎంత వారించినా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ ఖంగు తింటోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో కనిపిస్తోంది.

Operaion Sindoor: ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
Operaion Sindoor

Operaion Sindoor: ఎంత వారించినా.. వద్దన్నా.. కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్‌ (Pakistan)కు చుక్కలు కనబడుతున్నాయి. భారత్ (India) దాడులకు పాక్ కకావికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడులతో పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి (Anonymous) వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రజలను సయితం విరాళా అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. బారత్ మెరుపుదాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో భయం నెలకొంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మద్దతు కరువైంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ పాక్ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది.

Also Read: పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్


ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్..

మన దేశానికి డబ్బులు కావాలంటూ పాక్ ప్రజలు ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తులు చేస్తూ ట్యాగ్‌లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. వద్దని ఎంత వారించినా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ ఖంగు తింటోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో కనిపిస్తోంది. సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడుతూ గురువారం రాత్రి పాక్ జరిపిన దాడులకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్‌ క్షిపణులు, డ్రోన్లతో పెద్దఎత్తున దాడి చేసింది. ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది.


పాకిస్తాన్‌కు మరో దెబ్బ..

ప్రతిగా లాహోర్ సహా పాక్ చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థాలపై భారత్ సైన్యం భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాక్ డ్రోన్లు, రాకెట్లతో సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. అయితే భారత్ సైన్యం వాటిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసింది. అలాంటి అధునాతనమైన సిస్టమ్ భారత్‌కు అందుబాటులో ఉంది. కాగా పహల్గాం దుర్ఘటన అనంతరం భారత సరిహద్దులో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు బలోచిస్థాన్‌లో మరో దెబ్బ తగిలింది. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఏకంగా పాక్‌ సైన్యంపై విరుచుకుపడింది. బీఎల్‌ఏకు చెందిన ‘డెత్‌ స్క్వాడ్‌’ కలత్‌ జిల్లాలోని మంగోచెర్‌ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను కూడా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. బలోచ్‌ తిరుగుబాటుదార్లు ఆర్మీ క్యాంపుపై దాడి చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ తన సైన్యాన్ని భారత్‌ సరిహద్దుకు తరలిస్తున్న తరుణంలో బలూచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి...

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 11:07 AM