యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి...
ABN, Publish Date - May 09 , 2025 | 08:36 AM
India vs Pakistan: జమ్మూ యూనివర్శిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చి వేశాయి. అలాగే సత్వారిలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాక్ 8 క్షిపణుల దాడులు చేసింది. వాటిని భారత్ ఎయిర్, డిఫెన్స్ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి... సరిహద్దు ప్రాంతంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని సమర్ధవంతంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్ కోట్, జంబూ నగరం, ఉదంపూర్లో మూడు పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి.
Also Read: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
జమ్మూ యూనివర్శిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చి వేశాయి. అలాగే సత్వారిలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాక్ 8 క్షిపణుల దాడులు చేసింది. వాటిని భారత్ ఎయిర్, డిఫెన్స్ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
కాందహార్ సూత్రధారి రవూఫ్ హతం
For More AP News and Telugu News
Updated at - May 09 , 2025 | 08:36 AM