AP News: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ABN , Publish Date - May 09 , 2025 | 07:48 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ఛాయాపురం ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుక్రవారం అనంతపురం జిల్లా (Anantapur District)లో పర్యటించనున్నారు (Visit). ఉరవకొండ నియోజకవర్గం (Uravakonda Constituency)లో హంద్రీనీవా (Handri-Neeva) కాలువ విస్తరణ, లైనింగ్ పనులను ఆయన పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ఛాయాపురానికి చేరుకుని ఆ తర్వాత రోడ్డు మార్గాన ఆ గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. ఛాయాపురం ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.
సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే..
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు.. 10:40 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 11:20 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 11:30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరి 12:00 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం చేరుకుంటారు. 12:10 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఛాయాపురం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పరిశీలిస్తారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు.
Also Read: మిస్ వరల్డ్ పోటీలకు వేళాయే...
మధ్యాహ్నం 12:45 గంటలకు సీఎం చంద్రబాబు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి బయలుదేరి 12:50 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. 12:50 గంటల నుంచి 01:30 గంటల వరకు రిజర్వ్ టైమ్.. తర్వాత 2 గంటల నుంచి 3:30 గంటల వరకు ఛాయాపురం గ్రామపంచాయతీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి 3:35 గంటలకు బయలుదేరి 3:40 గంటలకు హెలిప్యాడ్కు వెళతారు. 3:45 గంటలకు ఛాయాపురం హెలిప్యాడ్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరి 4:15 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం 4:25 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాందహార్ సూత్రధారి రవూఫ్ హతం
నేడు గుంటూరు సీఐడీ ఆఫీసుకు సజ్జల, దేవినేని
For More AP News and Telugu News