Secunderabad Ganesh Temple: వినాయక చవితి ఉత్సవాలకు సికింద్రాబాద్ గణేష్ ఆలయం ముస్తాబు

ABN, Publish Date - Aug 22 , 2025 | 07:37 PM

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు27వ తేదీన వచ్చింది. దీంతో భక్తులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గణేష్ చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నా వినాయక దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. గణేష్‌ ఉత్సవాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. వివిధ రంగులతో దేవాలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated at - Aug 23 , 2025 | 02:11 PM