Women Empowerment Conference: తిరుపతిలో మహిళా సాధికారత సదస్సు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Sep 15 , 2025 | 06:51 AM
తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారిక సదస్సు జరగడం మంచి పరిణామమని వారు ఉద్ఘాటించారు.
1/13
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి.. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వేదికగా నిలిచింది.
2/13
దేశ నలుమూలల నుంచి మహిళా సాధికారత కమిటీ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రముఖులు హాజరవడంతో తిరుపతి ఒక చారిత్రక ఘట్టానికి ఆతిథ్యమిచ్చింది.
3/13
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ‘వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సు ఆదివారం రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది.
4/13
చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులు.. వాటిని అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై చర్చించారు.
5/13
‘మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్ర, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని ఓం బిర్లా ఉద్ఘాటించారు.
6/13
ఓం బిర్లాతో కరచాలనం చేస్తున్న అయ్యన్న పాత్రుడు
7/13
మహిళా సాధికారత సదస్సులో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మహిళా ప్రతినిధులు
8/13
మహిళా సాధికారత సదస్సు ప్రారంభిస్తున్న ఓం బిర్లా, తదితరులు
9/13
మహిళా సాధికారత సదస్సులో బీజేపీ ఎంపీ డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
10/13
మహిళా సాధికారత సదస్సులో కూటమి నేతలు
11/13
మహిళా సాధికారత సదస్సులో ఏర్పాటు చేసిన మెడికల్ స్టాల్
12/13
మహిళా సాధికారత సదస్సు సందర్భంగా బందోబస్తులో పాల్గొన్న పోలీసులు
13/13
మహిళా సాధికారత సదస్సులో మహిళా ప్రతినిధులు
Updated at - Sep 15 , 2025 | 06:58 AM