Home » Om Birla
పార్లమెంటులో ఇటీవల విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీని సభకు రావొద్దొని సూచించినట్టు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్లోకి దూసుకెళ్లి ఆయన నిందించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్సభ సెక్రటరీకి అందజేశారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు.
గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో ఈ-సిగరెట్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓ టీఎంసీ ఎంపీ.. సభలో ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లేవనెత్తారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.
మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఉద్ఘాటించారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓంబిర్లా పేర్కొన్నారు.
లోక్సభలో ఇవాళ ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలడిగితే దేశ ప్రజలకు..
ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ స్వీకరించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరిపేందుకు కేంద్ర అంగీకరించింది. జూలై 21న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పలు అశాంలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.
వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నుంచి లోక్సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది.