Train: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - May 10 , 2025 | 12:07 PM
రైలు పట్టాలపై పెద్దబండ రాళ్లను పెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే... ప్రయాణికుల రైలు కాకుండా.. గూడ్స్ రెలు ఆ మార్గంలో రావడం, అది పెద్ద శబ్దంతో రావడంతో వెంటనే గమనించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం వారు వచ్చి చూడగా పెద్ద బండరాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది.

- తిరుప్పూరు సమీపంలో రైలు పట్టాలపై రాళ్లు
చెన్నై: తిరుప్పూరు - వంజిపాళయం(Tiruppur-Vanjipalayam) మధ్య కావిలిప్పాళయం సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రాళ్లను ఉంచారు. ఆ మార్గంలో వెళ్ళిన గూడ్సురైలు కింద ఆ రాళ్లు నలుగుతూ పెద్ద శబ్దం రావటంతో లోకోపైలట్ వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. దీంతో శుక్రవారం వేకువజామున రైల్వే భద్రతా దళం ఎస్ఐ రువంతికా, పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: Udayanidhi: విద్యార్థులకు డిప్యూటీ సీఎం పిలుపు.. ఆ లైబ్రరీకి రండి
ఆ పట్టాల వద్ద పెద్ద రాళ్లు గూడ్సురైలు చక్రాల కింద నలిగి ఉండటాన్ని గమనించారు. సంఘటన స్థలానికి చేరువగా టాస్మాక్ దుకాణం ఉండటంతో మద్యం మత్తులో ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News