Indian Ministry of Defense: రూ. 30,000 కోట్ల ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం..
ABN , Publish Date - Aug 11 , 2025 | 09:41 PM
ఈ లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలు(UAV)లు భారతదేశానికి గూఢచారి, రికనైసెన్స్, ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ: భారత సాయుధ దళాలను ఆధునీకరించే దిశగా మరో కీలకమైన అడుగు పడింది. రూ. 30,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీని ద్వారా లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలును భారత్ కొనుగోలు చేయనుంది.
ఈ లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలు(UAV)లు భారతదేశానికి గూఢచారి, రికనైసెన్స్, ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ యూఏవీలు చైనా సరిహద్దుల్లో.. భారత మహాసముద్ర ప్రాంతంలో గస్తీ కాయనున్నట్లు సమాచారం. రక్షణలో ఆత్మనిర్భర్తలో భాగంగా మేక్-ఇన్-ఇండియా చొరవకు ప్రధాన ప్రోత్సాహకంగా, రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత
వైఎస్ జగన్ మేనమామపై కేసు నమోదు!