Union Cabinet: వొడాఫోన్ ఐడియా ఎజీఆర్ బకాయిల ఫ్రీజ్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:58 PM
ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: రుణాల భారం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాపోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిలను రూ.87,695 కోట్లకు సర్దుబాటు చేసి స్తంభింపచేసింది. 2032-41 మధ్య రూ.87,695 కోట్ల బకాయిలను చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 20 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల ప్రయోజనాలకు రక్షణ ఏర్పడుతుందని, టెలికాం రంగం మనుగడ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు ఒక లైఫ్లైన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియాలో భారత ప్రభుత్వానికి సుమారు 49 శాతం వాటా కూడా ఉంది.
కాగా, రూ.20,668 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. నాసిక్-షోలాపూర్ 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాసిక్-షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించనున్నారు.
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్నాథ్ పతాకావిష్కరణ
ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్లను దాఖలు గడువు పెంపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి