Share News

Ayodhya: మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ

ABN , Publish Date - Sep 23 , 2025 | 03:30 PM

సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రక తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని, మసీదు నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం 5 ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్టుకు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Ayodhya: మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ
Blue print of Ayodhya Mosques

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాన్‌ను అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ (ADA) తోసిపుచ్చింది. పలు ప్రభుత్వ శాఖల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో ఏడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పునకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు యూపీ ప్రభుత్వం అప్పగించింది.


రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) కింద పాత్రికేయుడు ఓం ప్రకాష్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఏడీఏ సెప్టెంబర్ 16న సమాధానం ఇచ్చింది. మసీదు ట్రస్టు 2021 జూన్ 23న అప్లికేషన్ పెట్టుకుందని, అయితే వివిధ శాఖల నుంచి క్లియెరెన్స్ లేకపోవడంతో దానిని తిరస్కరించామని తెలిపింది. ప్రజాపనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సివిల్ ఏవియేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ సర్వీసు నుంచి అనుమతులు పొందలేదని తెలిపింది.


సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రక తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని, మసీదు నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం 5 ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్టుకు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధాన్నిపూర్ గ్రామం సోహవల్ తహసిల్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డుకు అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ అంజు కుమార్ ఝా అందజేశారు. అప్లికేషన్, సెక్యూరిటీ ఫీజు కింద మసీదు కమిటీ రూ.4,02,628 చెల్లించిందని, అయితే డిపార్ట్‌మెంటల్ ఆమోదం లేకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని ఆర్డీఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడీఏ తెలిపింది.


మసీదు ట్రస్టు స్పందన

అయోధ్య డవలప్‌మెంట్ అధారిటీ నిర్ణయంపై మసీదు ట్రస్టు సెక్రటరీ అథర్ హుస్సేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మసీదు నిర్మాణానికి భూమి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని, అయితే ప్రభుత్వ శాఖలు ఎందుకు నో-అబ్జెక్షన్ ఇవ్వలేదో, మసీదు ప్లాన్‌ను అధికార యంత్రాంగం ఎందుకు తోసిపుచ్చిందో అర్థం చేసుకోలేకున్నామని అన్నారు.


ఇవి కూాడా చదవండి..

23 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్

మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 03:32 PM