Share News

Operation Sindoor: పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం..

ABN , Publish Date - May 10 , 2025 | 01:52 PM

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను భారత్ ముప్పేట దాడి చేస్తోంది. డ్రోన్‌లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెబుతోంది. ఎల్ఓసీ వెంబడి 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ దాడులను దీటుగా తిప్పికొట్టింది. తాజాగా..

Operation Sindoor: పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం..

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను భారత్ ముప్పేట దాడి చేస్తోంది. డ్రోన్‌లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెబుతోంది. ఎల్ఓసీ వెంబడి 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ దాడులను దీటుగా తిప్పికొట్టింది. తాజాగా ప్రతీకార చర్యలకు దిగిన భారత్.. పాకిస్తాన్‌లోని సైనిక స్థావరాలు, విమానయాన స్థావరాలపై దాడులు చేసింది.


సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌ను (Pakistan) భారత్ కోలుకోలేని దెబ్బ కొడుతోంది. భారత్ సరిహద్దుల్లోని 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న భారత్.. పాక్‌కు సరైన రీతిలో బుద్ధి చెబుతోంది. తాజాగా పాకిస్తాన్‌లోని సుక్కూర్, చునియాలోని సైనిక స్థావరాలు (Military bases), పస్రూర్‌లోని రాడార్ సైట్, సియాల్‌కోట్ విమానాశ్రయాలు (Airports) లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు.


పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. శుక్రవారం రాత్రి పాక్ చేసిన దాడుల గురించి వివరించేందుకు భారత విదేశాంగశాఖ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ వివరాలను వెల్లడించారు. పాకిస్తాన్ దాడులపై వ్యూహాత్మకంగా ప్రతీకారం తీసుకున్నామని తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన టెక్నికల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ గోదాములను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Read latest National News And Telugu News

Updated Date - May 10 , 2025 | 01:57 PM