Share News

BREAKING: ఏపీ నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్

ABN , First Publish Date - Oct 10 , 2025 | 07:24 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: ఏపీ నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్

Live News & Update

  • Oct 10, 2025 21:05 IST

    నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ఇథనాల్ ప్రాజెక్ట్, లైఫ్ స్కూల్, గోశాల ప్రారంభం

    • ఇథనాల్ పరిశ్రమతో రైతులకు మంచి జరుగుతుంది: చంద్రబాబు

    • గోశాలలో ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు: చంద్రబాబు

    • నందగోకులంలో పేద పిల్లలకు విద్య అందిస్తున్నారు

    • P4లో అందరూ భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు

    • నెల్లూరు జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం: చంద్రబాబు

    • త్వరలో రామాయపట్నం, దుగ్గరాజుపట్నం రాబోతోంది: చంద్రబాబు

    • 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెం.1గా అవుతుంది: చంద్రబాబు

    • దేశంలోనే ఏపీని నెంబర్ 1గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

  • Oct 10, 2025 18:48 IST

    మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్

    • మైక్రోసాఫ్ట్‌తో పాటు ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కూ సలహాదారుగా రిషి

    • రిషి సునక్ నియామకానికి షరతులతో యూఎస్ ప్రభుత్వం అనుమతి

    • ఇప్పటికే గోల్ట్‌మన్ శాక్స్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్న రిషి సునక్

  • Oct 10, 2025 18:47 IST

    ఏపీ నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్

    • సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావు

    • గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్దన్‌రావు అరెస్ట్

    • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్దన్‌రావు

  • Oct 10, 2025 18:41 IST

    ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది: సీఎం చంద్రబాబు

    • మన పిల్లలకు శిక్షణ ఇస్తే.. ప్రపంచాన్ని శాసిస్తారు: చంద్రబాబు

    • రామాయపట్నంలో త్వరలో బీపీసీఎల్‌ పెట్టుబడులు పెట్టబోతోంది

    • 2047 నాటికి ప్రపంచదేశాల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉంటుంది

    • 2047 నాటికి భారత్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉంటుంది: చంద్రబాబు

    • 2047 నాటికి తెలుగుజాతి అగ్రస్థానంలో ఉంటుంది: చంద్రబాబు

    • విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ రాబోతుంది: చంద్రబాబు

    • మూడేళ్లలో రూ.88 వేల కోట్ల పెట్టుబడులు గూగుల్‌ పెట్టబోతుంది: చంద్రబాబు

  • Oct 10, 2025 18:41 IST

    కృష్ణా: మచిలీపట్నం పోలీసులపై పేర్ని నాని తీవ్ర విమర్శలు

    • కొల్లు రవీంద్ర మజా కోసమే పోలీసులు పని చేస్తున్నారు: పేర్ని

    • అధికార పార్టీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం

    • కొందరు పోలీస్ అధికారుల తీరు పట్ల కానిస్టేబుళ్లు నలిగిపోతున్నారు

    • వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం

    • 41ఏ నోటీసులు ఇచ్చే క్రమంలో వైసీపీ కార్యకర్తలను.. భయపెడుతున్నారని ఆరోపించిన పేర్నినాని

    • పోలీసుల తప్పుడు కేసులను కోర్టుల్లో ఎదుర్కొంటాం: పేర్నినాని

  • Oct 10, 2025 18:41 IST

    కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనపై మంత్రుల బృందం సమీక్ష

    • ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రుల బృందం

    • ఈనెల 16న కర్నూలులో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌పై ప్రధాని సభ

    • ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌, లోకేష్‌

  • Oct 10, 2025 18:41 IST

    పైడితల్లి అమ్మవారి పండుగను ఏ ఒక్కరిదో అన్నట్లు చేస్తున్నారు: బొత్స

    ఆర్భాటం, అహంకారం తప్పా సంప్రదాయబద్ధంగా పండుగ జరగలేదు: ఎమ్మెల్సీ బొత్స

    పండుగ జరపడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టారు: ఎమ్మెల్సీ బొత్స

    గతంలో ఎప్పుడూ లేని విధంగా బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు: ఎమ్మెల్సీ బొత్స

    పూర్తి నిర్లక్యంగా వ్యవహరించారు: బొత్స సత్యనారాయణ

  • Oct 10, 2025 16:23 IST

    మచిలీపట్నం పీఎస్‌లో సీఐతో పేర్నినాని ఘర్షణ

    • ఇటీవల పేర్నినాని నాయకత్వంలో మెడికల్ కాలేజీ దగ్గర నిరసన

    • అనుమతులు లేని నిరసనలో పాల్గొన్నారని పేర్నినానితో సహా..

    • 400 మందికి 41ఎ నోటీసులు ఇచ్చిన పోలీసులు

    • పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దన్న వైసీపీ నేత సుబ్బన్న

    • కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్న పోలీసులు

    • కార్యకర్తలతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పేర్ని నాని

    • ఆర్ పేట సీఐతో ఘర్షణకు దిగిన పేర్నినాని

    • పేర్ని నాని చర్యలతో విస్తుపోయిన పోలీసులు

    • స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని కోరిన పోలీసులు

  • Oct 10, 2025 14:45 IST

    ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

    • గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్న చంద్రబాబు, లోకేష్

    • విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్‌కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన

    • ఈ నెల 14న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో కలిసి..

    • కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో ఒప్పందం

    • విశాఖలో రూ.84వేల కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు

    • దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కలిసే అవకాశం

  • Oct 10, 2025 14:45 IST

    గుంటూరు: అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా

    • విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశం

    • అన్నపర్రు బీసీ హాస్టల్ ఘటనపై దర్యాప్తునకు మంత్రి సవిత ఆదేశం

    • ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై నివేదికివ్వాలని మంత్రి ఆదేశం

  • Oct 10, 2025 14:45 IST

    అమరావతి: మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను మూత పడకుండా చేయగలిగాం: సీఎం చంద్రబాబు

    స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగాం: సీఎం చంద్రబాబు

    విశాఖ రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్‌ తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు

    ఆర్సెల్ మిట్టల్ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన: చంద్రబాబు

    ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

    విశాఖను ముంబైలా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

  • Oct 10, 2025 14:45 IST

    కరీంనగర్: బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: ఈటల

    • ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుంది: ఎంపీ ఈటల

    • తెలంగాణ ప్రజలను రేవంత్‌రెడ్డి వంచించారు: ఈటల

    • హుజురాబాద్‌లో బీ ఫామ్స్ నేనే ఇస్తా: ఎంపీ ఈటల

    • నేను కాకుండా బీ ఫామ్స్ ఎవరిస్తారు?: ఎంపీ ఈటల

  • Oct 10, 2025 14:38 IST

    వెనెజులా మహిళకు నోబెల్ శాంతి బహుమతి

    • మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

    • ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు మరియాకు నోబెల్

    • వెనెజులా పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడో

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నోబెల్ ఆశలు గల్లంతు

    • నోబెల్ శాంతి బహుమతి ఆశించిన డొనాల్డ్ ట్రంప్

  • Oct 10, 2025 13:38 IST

    అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..

    • నాకు అసంతృప్తి ఉంది.. ఏబీఎన్‌తో అంజన్ కుమార్ యాదవ్

    • నా బాధనంతా మీనాక్షీ నటరాజన్ కు చెప్పాను

    • కేంద్ర మంత్రిని కావలసిన వాడిని కాలేకపోయాను..

    • రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతాను..

    • ఇప్పటికైనా మా సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని చెప్పాను..

    • దేవుడి దగ్గరికి వెళ్తే అందరికీ ఆశీస్సులు ఇస్తారు..

    • అవసరం ఉంటే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తా: అంజన్ కుమార్ యాదవ్

  • Oct 10, 2025 12:05 IST

    హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత

    • గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత

    • 17 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు.

    • హస్టల్‌లో అందుబాటులో లేని వార్డెన్ .

    • విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన వంటమనిషి.

  • Oct 10, 2025 10:46 IST

    చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..

    • ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షాలు

    • ఉరుములు, మెరుపులు, పిడుగులు, శబ్దాలతో కూడిన వర్షం.

    • భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

    • కోతలకు గురైన రోడ్లు.. నీట మునిగిన వరి, కూరగాయ పంటలు.

    • అర్ధరాత్రి నుంచి 15 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

  • Oct 10, 2025 10:43 IST

    రూ.కోటి విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం

    • రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం పట్టివేత

    • కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు..

    • డ్రగ్స్ రాకెట్‌పై మధ్యాహ్నం మీడియాకు వివరాలు వెల్లడించనున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు..

  • Oct 10, 2025 10:19 IST

    రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

    • రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

    • భేటీలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల, దుర్గేష్‌, బాలవీరాంజనేయస్వామి

    • రుషికొండ ప్యాలెస్‌ను ప్రజా అవసరాల కోసం.. ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చ

    • పలువురి అభిప్రాయాలు సేకరించి తుదినిర్ణయం తీసుకోనున్న సబ్‌ కమిటీ

  • Oct 10, 2025 09:55 IST

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు..

    • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఆక్రమణకు గురైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలం..

    • సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా..

    • భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా సిబ్బంది..

  • Oct 10, 2025 07:32 IST

    భారీ వర్షాలు.. 5 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

    • నల్లగొండ అనుముల మండలం పేరూరు వద్ద వర్షానికి తెగిన బ్రిడ్జ్

    • చెరువు నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నీటి తాకిడికి తెగిపోయిన సీసీ రోడ్.

    • 5 గ్రామాల ప్రజలకు నిలిపోయిన రాకపోకలు

    • ఇబ్బంది పడుతున్న ప్రజలు.