India Pak Tensions: దౌత్యమే శరణ్యం... పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు
ABN , Publish Date - May 09 , 2025 | 06:48 PM
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనం లో పేర్కొంది.

ఇస్లామాబాద్: హహల్గాం ఉగ్రదాడి, ఇందుకు ప్రతిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ నిర్ణయంతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) స్పందించారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif)కు సూచించినట్టు 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనంలో పేర్కొంది.
Pak PM Shehbaz Sharif: మోదీ పేరు కూడా పలకని భయస్తుడు ప్రధాని షెహబాజ్..ఎంపీ షాహిద్ విమర్శ
సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసిన నేపథ్యంలో తన సోదరుడికి సహకరించేందుకు నవాజ్ షరీప్ ఇటీవల లండన్ నుంచి పాకిస్థాన్కు చేరుకున్నారు. పీఎంఎల్ఎన్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని దౌత్యమార్గాలను ఉపయోగించుకుని ఇరు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించాలని, ఎలాంటి దుండుడుకు చర్యలకు పాల్పడవద్దని షెహబాద్ను నవాజ్ కోరినట్టు ఆ కథనం పేర్కొంది.
తప్పు మాదే..
నవాజ్ షరీప్ 2023లో భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్గిల్ యుద్ధానంతరం ఆయన పదవీచ్యుతుడయ్యారు. కార్గిల్ యుద్ధాన్ని తాను వ్యతిరేకించడం వల్లే తనను పదవి నుంచి తప్పించారంటూ ఆప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. పీఎంఎల్ పనితీరు ఎప్పుడూ బాగానే ఉందని, అయితే ప్రతిసారి పదవీచ్యుతిని ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. ''1993, 1999లో మా ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చోసారో తెలుసుకోవాలనుకుంటున్నారు. కార్గిల్ యుద్ధాన్ని వ్యతిరేకించడమే అందుకు కారణమా?'' అని నవాజ్ ప్రశ్నించారు. 1999 అక్టోబర్లో తిరుగుబాటుతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. 1999లో ఇండియాతో ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని కూడా నవాజ్ గత ఏడాది అంగీకరించారు. 1998 మే 29న పాకిస్థాన్ 5 అణుపరీక్షలు నిర్వహించిందని, ఆ తర్వాత వాజ్పేయి ఇక్కడకు రావడం, తమతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని అన్నారు. కానీ, ఆ ఒప్పందాన్ని తాము ఉల్లంఘించామని, అది తమ తప్పిదమేనని అంగీకరించారు. లాహోర్ డిక్లరేషన్ పేరుతో 1999 ఫిబ్రవరి 21న వాజ్పేయి, నవాజ్ షరీఫ్ సంతకాలు చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య శాంతి, సుస్థిరతను పెంచేందుకు జరిగిన ఒప్పందం ఇది. అయితే, ఒప్పందం జరిగిన కొద్ది కాలానికే పాక్ బలగాలు జమ్మూకశ్మీర్లోని కార్గిల్లో చొరబడ్డారు. ఇది కార్గిల్ యుద్ధానికి దారితీసింది.
ఇవి కూడా చదవండి..