Hyderabad: ఆ విద్యుత్ మీటర్లు కాంట్రాక్టర్ ఇంట్లో ఎందుకున్నాయో..
ABN , Publish Date - May 03 , 2025 | 07:42 AM
ఓ కాంట్రాక్టర్ ఇంట్లో 42 విద్యుత్ మీటర్లు బయటపడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. అదే శాఖలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి వాటిని ఎందుకు దాచారు.. అన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అంతేగాక ఈ విషయంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కాంట్రాక్టర్ ఇంట్లో బయటపడిన
42 విద్యుత్ మీటర్లు
స్వాధీనం చేసుకున్న పోలీసులు
కేసు నమోదు
హైదరాబాద్: ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఇంట్లో అక్రమంగా దాచిన విద్యుత్శాఖకు చెందిన 42 కరెంటు మీటర్లు బయటపడ్డాయి. రాయదుర్గం(Rayadurgam) పోలీసులు శుక్రవారం వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దీంతో విద్యుత్శాఖలో మరోసారి డొల్లతనం బయటపడింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్. వెంకన్న(Rayadurgam Inspector Ch. Venkanna) తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్శాఖ ఇబ్రహీంబాగ్ సబ్డివిజన్కు చెందిన ఏడీ అంబేడ్కర్ తమ వద్ద ఉండాల్సిన విద్యుత్ మీటర్లలో కొన్ని చోరీకీ గురయ్యాయని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సీటు కోసం ఘర్షణ.. పిడిగుద్దులకు ఒకరి మృతి
గతంలో తమ వద్ద పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డి వద్ద ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు. గచ్చిబౌలి టెలికం నగర్లో ఉంటున్న చెన్నకేశవరెడ్డి(Chennakeshava Reddy) ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా 42 మీటర్లు బయటపడ్డాయి. వీటిని అక్రమంగా ఇంట్లో దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మీటర్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్పోర్టు.. బసంత్నగర్లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News