Share News

Nirmala Sitharaman: పాకిస్తాన్‌తో ఉద్రిక్తత..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచన

ABN , Publish Date - May 09 , 2025 | 09:54 PM

పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సైబర్ భద్రతా ఉల్లంఘనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.

Nirmala Sitharaman: పాకిస్తాన్‌తో ఉద్రిక్తత..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచన
Tensions with Pakistan Minister Nirmala Sitharaman

భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్‎తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాంకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదన్నారు. దీంతోపాటు ATMలలో నగదు అందుబాటు, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, అలాగే ఇతర అత్యవసర బ్యాంకింగ్ సౌకర్యాలు నిరంతరం పనిచేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.


ఎందుకు ముఖ్యమంటే..

సంక్షోభ సమయంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల ఆర్థిక అవసరాలు మరింత సులభం అవుతాయి. ఇదే సమయంలో సైబర్ దాడుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకులు డిజిటల్ సౌకర్యాలను సురక్షితంగా ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ సైబర్ భద్రతా వ్యవస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. DDoS (డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్) దాడులను నిరోధించేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. అలాగే, ఫిషింగ్ దాడులను గుర్తించేందుకు బ్యాంక్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాయి.

సైబర్ మోసాల పట్ల..

ఈ క్రమంలో బ్యాంకులు తమ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్స్ (SOCs), నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్స్‌ను రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉంచాయి. ఇవి CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్), NCIIPC (నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్)తో సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ సమన్వయం వల్ల సైబర్ బెదిరింపులను తక్షణమే గుర్తించి, స్పందించే అవకాశం ఉంది.


భద్రతకు ప్రాధాన్యత

సరిహద్దు ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచ్‌లలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల భద్రతపై సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని, వారికి తగిన రక్షణ కల్పించాలని బ్యాంకులకు ఆదేశించారు. ఇది బ్యాంక్ సిబ్బంది ధైర్యంగా పనిచేయడానికి, ప్రజలకు సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు.

బీమా సంస్థలకు ఆదేశాలు

బ్యాంకులతో పాటు, బీమా సంస్థలకు కూడా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ వేగవంతం చేయాలని, కస్టమర్ సేవల్లో అంతరాయం రాకుండా చూడాలని సూచించారు. అలాగే, రీజనల్ రూరల్ బ్యాంకులకు (RRBs) స్పాన్సర్ బ్యాంకులు మద్దతు అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు సజావుగా సాగేందుకు ఈ చర్యలు దోహదపడతాయి.


నిఘా, రిపోర్టింగ్

సీతారామన్ బ్యాంకులకు రెండు సీనియర్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ఒకరు సైబర్ సంబంధిత సమస్యలను పర్యవేక్షిస్తారు. మరొకరు బ్రాంచ్‌లు, ATMలు, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ అధికారులు ఏదైనా సమస్యను CERT-In, DFS, ఇతర సంబంధిత సంస్థలకు తక్షణమే నివేదించాలి. ఈ రియల్-టైమ్ సమన్వయం సమస్యలను వేగంగా పరిష్కరించడానికి దోహదపడుతుంది. సీతారామన్ ఈ సందర్భంగా పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకులు, బీమా సంస్థల MDలు, CEOలతో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో DFS, CERT-In, RBI, IRDAI, NPCI వంటి సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన


India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు


Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 09:54 PM