Share News

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

ABN , Publish Date - May 09 , 2025 | 03:26 PM

ఇలాంటి క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. మన హీరోల ధైర్యసాహసాలకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని, దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసిన త్యాగాలను మరువలేమని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ
Virat Kohli

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భారత సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‎లపై పాకిస్తాన్ దాడులు చేసింది. ఈ ఘటనలో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఘాటుగా స్పందించిన భారత్ ఈ దాడులకు తగిన సమాధానం (Operation Sindoor) ఇచ్చింది. పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేసింది. ఇది మాత్రమే కాదు, లాహోర్, కరాచీ, రావల్పిండిలలోని HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థను భారతసైన్యం ధ్వంసం చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ఆటలను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.


ఈ క్రమంలో భారత సైన్యం సేవల గురించి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత సైన్యం స్ఫూర్తి కారణంగా, దేశ పౌరులు సురక్షితంగా ఉన్నారని సైన్యం సేవలను ప్రశంసించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుతున్న మన సైన్యానికి సెల్యూట్ చేయాలన్నారు. సైన్యం ధైర్యసాహసాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, సైన్యం త్యాగానికి వారి కుటుంబాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఓ స్టోరీలో పోస్ట్ చేశాడు.


కోహ్లీ ఈ పోస్ట్ చేసిన గంటలోనే 34 లక్షల మంది లైక్ చేస్తూ ఈ పోస్టును షేర్ చేయడం విశేషం. దీంతోపాటు అనేక మంది జై హింద్ అంటూ పలు రకాల కామెంట్లు చేస్తూ సైన్యానికి మద్దతుగా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోవైపు మనల్ని హీరోలలా రక్షించిన భారత సాయుధ దళాలకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. వారి త్యాగాలకు, వారికి, వారి కుటుంబాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఐపీఎల్ రద్దు తర్వాత ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. IPL 2025 తదుపరి మ్యాచ్ ఈరోజు (మే 9) LSG vs RCB మధ్య జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచుకు ముందే BCCI టోర్నమెంట్‎ను వాయిదా వేయాలని నిర్ణయించింది. విరాట్ కోహ్లీ లక్నోలో ఉన్నాడు. ఈ క్రమంలో టోర్నమెంట్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లందరినీ వారి ఇళ్లకు పంపడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ IPL 2025లో RCB తరపున ఆడుతున్నాడు. కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 63.12 సగటుతో 505 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.


ఇవి కూడా చదవండి

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 05:36 PM