India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
ABN , Publish Date - May 09 , 2025 | 07:06 PM
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ప్రజలు అనవసరంగా నిత్యావసరాల వస్తువులను నిల్వ చేయడం మానుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసర వస్తువుల స్టాక్లు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సాధారణ స్థితిలో ఉందని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీ: ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో నిత్యావసర సరకులు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి, స్టోర్ చేసుకోవాలనుకునే వారికి కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. కూరగాయలు, పప్పులు సహా ఇతర అత్యవసరాల ధరలు, నిల్వ ప్రస్తుతం సాధారణ స్థితిలో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం హామీ
భారత్లో కూరగాయలు, ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆయా వస్తువుల సరఫరా అన్ని నగరాల్లో క్రమం తప్పకుండా కొనసాగుతోందన్నారు. రవాణా వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అధికారుల ప్రకారం.. రాష్ట్రాల మధ్య ఆహార పదార్థాల రవాణా సాఫీగా జరుగుతోందని, ఇదే సమయంలో నగరాలకు రోజువారీ సరఫరా యథావిధిగా అందుతోందని చెప్పారు.
అధిక మొత్తంలో
ఈ నేపథ్యంలో ప్రజలు ఆహారం లేదా రోజువారీ వినియోగ వస్తువులను అధిక మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థలో స్థిరత్వం ఉండేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ హామీతో, ప్రజలు భయాందోళనలకు లేకుండా సాధారణ జీవనం కొనసాగించవచ్చని ప్రభుత్వం సూచించింది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ధరల నియంత్రణపై దృష్టి
ఈ సమయాన్ని ఆసరగా చూసుకుని పలువురు వ్యాపారులు లేదా సరఫరాదారులు అక్రమంగా ధరలు పెంచడం లేదా వస్తువులను నిల్వ చేయడం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అనవసర భయాందోళనలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నాలను కూడా అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాపారులు, సరఫరాదారులపై నిశితంగా నిఘా ఉంచాలని సూచించారు.
అన్యాయంగా పెంచితే..
ఎవరైనా ధరలను అన్యాయంగా పెంచడం లేదా స్టాక్లను దాచడం వంటి చర్యలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ సమావేశాల ద్వారా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరిగి, సరఫరా వ్యవస్థలో స్థిరత్వం నిర్వహించడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు వేదికల ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి