Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:52 AM
దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి: దసరా, దీపావళి(Dasara, Diwali) సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి(Tirupati) నుంచి సాయినగర్ షిరిడీ, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లు అక్టోబరు 5 నుంచి నవంబరు 24 వరకు నడుస్తాయి.

తిరుపతి నుంచి షిరిడీకి ప్రత్యేక రైలు(07637), షిరిడీ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు(07638) నవంబరు 24 వరకు రాకపోకలు సాగిస్తాయి. నరసాపురం- తిరువణ్ణామలై (07219-07220), హైదరాబాదు- కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari)(07230-07229), కాచిగూడ-మధురై (07191-07192), హైదరాబాదు- కొల్లాం ప్రత్యేక రైళ్లు (07193-07194) రేణిగుంట, తిరుపతి మీదుగా నవంబరు నెలాఖరు వరకు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్లో 3,92,669 మంది ఓటర్లు
Read Latest Telangana News and National News