Share News

Bhumireddy Ramgopal Reddy: ఆ స్కాంపై దర్యాప్తు చేయండి.. సీఎం చంద్రబాబుకు లేఖ

ABN , Publish Date - May 05 , 2025 | 08:03 PM

Bhumireddy ramgopal reddy: వైసీపీ హయాంలో పలు అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. తాజాగా మరో అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ వినిపిస్తోంది.

Bhumireddy Ramgopal Reddy: ఆ స్కాంపై దర్యాప్తు చేయండి.. సీఎం చంద్రబాబుకు లేఖ

అమరావతి, మే 05: జగన్ ప్రభుత్వ హాయాంలో రైతు భరోసా కేంద్రాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడును ఆయన కోరారు. అందుకోసం సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. 2020-2024 మధ్య కాలంలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణ.. నగదు పంపిణీలో జరిగిన రూ. 104 కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని ఆ లేఖలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వివరించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వీటి కోసం ప్రతి నెల రూ. 2,047 కేటాయించారని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటైన అనంతరం కేవలం 4, 5 నెలలు మాత్రమే నగదు చెల్లించారని ఆ లేఖలో ఆయన సోదాహరణగా పేర్కొన్నారు. ఆ తరువాత ఏ ఒక్క నెలలో కూడా నిర్వహణకు ఆర్‌బీ కేంద్రాలకు నగదు ఇవ్వకుండా కోట్లాది రూపాయిల నగదు స్వాహా చేశారని ఆ లేఖలో ఆయన విమర్శించారు.


ఆర్‌బీకేలో పని చేసే సిబ్బంది.. కార్యాలయ నిర్వహణ కోసం తమ సొంత నగదు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆర్‌బీకేకు కేటాయించిన నగదు వారికి ఇవ్వకుండా.. దోచుకున్న వైనంపై సమగ్ర విచారణ జరపాలని ఆ లేఖలో సీఎం చంద్రబాబు నాయుడును ఆయన కోరారు. ఈ నిధులు దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ కానీ.. సి.బి సిఐడితో కానీ విచారణ జరిపించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Vidadala Rajini: విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్.. జైలుకు తరలింపు

Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 05 , 2025 | 08:03 PM