Share News

TS NEWS: రేవంత్ రెడ్డి ఆ తప్పులే చేస్తున్నారు.. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 10 , 2024 | 06:32 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చేస్తున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . భువనగిరిలో ఇద్దరు పిల్లల మరణం ప్రభుత్వ హత్యనేనని తెలిపారు.

TS NEWS: రేవంత్ రెడ్డి ఆ తప్పులే చేస్తున్నారు..  ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చేస్తున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... భువనగిరిలో ఇద్దరు పిల్లల మరణం ప్రభుత్వ హత్యనేనని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలైనా విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని చెప్పారు. సంక్షేమ హాస్టల్లో, పాఠశాలల్లో కౌన్సిలర్లు ఉంటే పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పిల్లలకు రావాల్సిన డబ్బులను తీసికెళ్లి ప్రతిక ప్రకటనలకు ,ఉత్సవాలకు ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ సంక్షేమ భవనం ముందు శాంతియుత ధర్నా చేపడతామని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Updated Date - Feb 10 , 2024 | 06:32 PM