Share News

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

ABN , Publish Date - Mar 13 , 2024 | 09:17 AM

Telangana: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు.

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

సిద్దిపేట జిల్లా, మార్చి 13: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం పూర్తయినప్పటికీ కాలేజీ ఎందుకు అందులోకి షిఫ్ట్ చేయలేదని ప్రశ్నించారు. అంతే కాకుండా రేపే కాలేజీని డిగ్రీ కాలేజీ నూతన భవనంలోకి షిఫ్ట్ చేయాలని అధికారులకు, ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. నూతన భవనంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుదీప్ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌

Ranji Trophy Final: సచిన్ చారిత్రాత్మక రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 13 , 2024 | 09:21 AM